వర్షాకాలంలో  ఈ చర్మ సమస్యలు వస్తాయ్.. జాగ్రత్త!

వర్షాకాలంలో మొటిమలు  ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది.

ఈ కాలంలో తేమ కారణంగా శరీరంపై శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది అథ్లెట్స్ ఫుట్, రింగ్‌వార్మ్ సమస్యకు దారి తీస్తుంది.

తేమ స్థాయిల్లో హెచ్చుతగ్గులు తామర ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తాయి. చర్మం పొడిగా మారుతుంది. దురద సమస్య వస్తుంది.

ఈ సీజన్‌లో శరీరంపై దురదతో కూడిన ఎర్రటి దద్దుర్లు కూడా ఏర్పడుతాయి.

తేమతో కూడిన వాతావరణం  చర్మ అలెర్జీలకు దారితీస్తుంది.

ఈ సమస్యల నుంచి బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరాలు ఇవ్వడం జరిగింది. సమస్య ఏదైనా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.