సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగే పరిణామాలు  ఇవే..!

ఒక యంత్రం పనిచేయడానికి ఇంధనం ఎంత అవసరమో.. శరీరం తన విధులు సక్రమంగా నిర్వర్తించడానికి ఆహారం అంతే అవసరం.

సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కార్యకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయి.

చాలామంది ఏదో ఒక కారణంతో ఆహారాన్ని దాటవేస్తుంటారు.

కొందరి శరీరాలు ఆహారం తీసుకోనప్పుడు శరీరంలో కొవ్వును శక్తి వనరుగా మార్చుకుంటాయి.

శరీరంలో కొవ్వును శక్తి వనరుగా మార్చుకున్నప్పుడు శరీరంలో కీటోసిస్ సమస్య వస్తుంది.  ఇది అనేక ప్రతికూలతలు కలిగి ఉంటుంది.

శరీరంలో కొవ్వు శక్తిగా మారుతుంటే అలసట, మైకం ఏర్పడతాయి.  శరీరానికి పోషకాలు అందనప్పుడు ఇలా జరుగుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు,  గర్భిణీ స్త్రీలు,  18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు,  ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నవారు కీటోసిస్ సమస్య ఏర్పడుతుంది.

కడుపు సంబంధ సమస్యలు అప్పటికే ఎదుర్కొంటున్న వారు కూడా ఆహారం స్కిప్ చేయడం వల్ల ఈసమస్య బారిన పడతారు.

కొత్తగా ఏదైనా డైట్ ప్లాన్ చేసే ముందు ఆహారంలో మార్పులు జరుగుతాయి. కాబట్టి వైద్యుని సలహా లేకుండా ఇలాంటివి చేయకూడదు.