అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్-2           ఈ విశేషాలు తెలుసా? 

అనంత్ అంబానీ-రాధిక ప్రీ-వెడ్డింగ్-2 సెలబ్రేషన్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు యూరప్‌లో జరగబోతున్నాయి. 

అత్యంత విలాసవంతమైన ఓడలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఓడలో ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వస్తారు. 

ఈ వేడుకకు దాదాపు 800 మంది అతిథులను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. సల్మాన్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరుకాబోతున్నారట. 

29వ తేదీన ఆ ఓడలోనే ఓ స్టార్ నైట్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందట. 

31వ తేదీన అతిథులందరూ రోమ్‌లో ల్యాండ్ అవుతారట. అదే రోజ్ కేన్స్‌లో అందరూ పార్టీ చేసుకుంటారట. 

ఈ అన్ని రోజుల్లోనూ అతిథులకు పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ వంటకాలను వడ్డించబోతున్నారట.

అతిథులకు లగ్జరీ అనుభూతులను మాత్రమే కాదు.. ఖరీదైన బహుమతులు ఇవ్వబోతున్నారట.