ముంబై లాల్‌బాగ్ రాజు గణేష్‎కు అనంత్ అంబనీ భారీ విరాళం

లాల్‌బాగ్ గణేష్‎ను చూడటానికి ప్రజలు ముంబైకు భారీగా తరలివచ్చి ఉత్సవాలు తిలకిస్తుంటారు. 

ప్రతిఏడాది ఈ లాల్‌బాగ్చా రాజా గణేష్‎కు భక్తులు విశేష పూజలు చేస్తుంటారు.

లాల్‌బాగ్చా రాజా  గణేష్‎తో అనంత్ అంబానీ కుటుంబానికి  15 ఏళ్లుగా అనుబంధం ఉంది.

ఈ గణేష్‎ను  దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వీవీఐపీలు కూడా ఈ వినాయకుడిని దర్శించుకుంటారు. 

 ముకేష్ అంబానీ కుటుంబం కూడా  లాల్‌బాగ్చా రాజా గణపతికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. 

ఈసారి ఈ గణనాథుడి ఉత్సవాలకు అంబానీ కుటుంబం భారీ బహుమతిని అందజేసింది. 

లాల్‌బాగ్చా రాజా ఎగ్జిక్యూటివ్ బోర్డ్‎కు అంబానీ కుటుంబం ట్రస్ట్‎ సభ్యులుగా కూడా ఉన్నారు. 

అలాగే అనంత్-రాధిక వివాహం తర్వాత రానున్న మొదటి గణేష్ ఉత్సవం కావటంతో అంబానీ కుటుంబం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

 అనంత్ అంబానీ తరుపున 20 కేజీల బంగారు కిరీటాన్ని  ఈ వినాయకుడికి అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చారు. 

అయితే ఈ బంగారు కీరిటం ధర రూ.15 కోట్లు కావడం గమన్హారం. 

ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. 

ఆ మహా గణపతిపై భక్తిని ఈ విధంగా అంబానీ ఫ్యామిలీ చాటుకున్నారు.