ఈ ఆయుర్వేద సూత్రాలతో షుగర్‌కు చెక్ పెట్టండి..!

రాగి పాత్రలో నీటిని తాగడం డయాబెటిక్ పేషెంట్లకు మంచిది. 

వంట చేసేటపుడు కూరల్లో ఆవాలు, పసుపు, మెంతి పొడి, దాల్చిన చెక్క పొడులను వేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అమాంతం పెరిగిపోకుండా అడ్డుకుంటాయి. 

కరివేపాకును తినడం కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది

రోజూ తినే ఆహారంలో మెంతులను చేర్చితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

చేదు కాకర, ఆలూవెరా వంటి వాటిని తరచుగా తింటే చాలా మంచిది. 

ఉదయాన్నే ఉసిరి కాయలు తినడం లేదా ఉసిరి జ్యూస్ తాగడం మంచిది

అన్నం తినేటపుడు కొంచెం మెంతుపొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి.

ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేయాలి.