బిగ్ రిలీఫ్.. నేడు బంగారం  రేట్లు ఎలా ఉన్నాయంటే..

దీపావళి పండగ వేళ బంగారం కొనాలనుకునేవారికి గత  రెండ్రోజులపాటు  ధరలు షాక్ ఇచ్చాయి. 

అంతకుముందు తగ్గినట్లే  కనిపించిన రేట్లు ఈనెల  17, 18తేదీల్లో  భారీగా పెరిగాయి. 

దీంతో పసిడి ప్రియులు  కొనాలా, వద్దా అనే  ఆలోచనలో పడ్డారు.

అయితే తాజాగా నేడు  ధరలు స్వల్పంగా  మాత్రమే పెరిగాయి

దీపావళి నాటికి తులం  బంగారం ధర రూ.80వేలకు  చేరే అవకాశం ఉందని ట్రేడ్  వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హైదరాబాద్‌లో రెండ్రోజులుగా  బంగారం ధరలు పెరుగుతూ  రాగా నేడు(అక్టోబర్ 19న)  స్వల్పంగా మాత్రమే పెరిగాయి.

 అక్టోబర్ 19న 22 క్యారెట్ల  పసిడి తులానికి రూ.72,410  ఉండగా.. 24 క్యారెట్ల  తులం ధర రూ.78,990కి  చేరింది.

నిన్నటి రేట్లతో పోలిస్తే  10గ్రాములకు కేవలం రూ .10మేర స్వల్పంగా పెరిగింది. 

విజయవాడ, విశాఖపట్నంలో  22 క్యారెట్ల బంగారం ధర  రూ.72,410 కాగా.. 24 క్యారెట్ల  ధర రూ.78,990లుగా ఉంది.

 అయితే నిన్న వెండి మాత్రం  భారీ షాక్ ఇచ్చింది. ఒక్కరోజే  ఏకంగా కిలోకు రూ.2,100  పెరిగి రూ.1,05,000లకు  చేరింది

నేడు హైదరాబాద్,  విజయవాడ, విశాఖపట్నంలో  కిలోకు రూ.100 పెరిగి ధర రూ. 1,05,100 వద్ద  కొనసాగుతోంది.

అలాగే ఢిల్లీలో 10 గ్రాముల  22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,560 ఉండగా.. 24  క్యారెట్ల రేటు రూ.79, 140లుగా ఉంది.

ముంబై, చెన్నై, కోల్‌కతాలో  22 క్యారెట్ల తులం పసిడి ధర  రూ.72,410 కాగా.. 24 క్యారెట్ల  రేటు రూ.78,990లుగా ఉంది.