ముఖానికి పెరుగు రాసుకోవచ్చా?

చర్మం పొడిగా, నిర్జీవంగా  మారితే చర్మ సంరక్షణలో  భాగంగా పెరుగును చేర్చుకోవచ్చు.

ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్  చేయడానికి పని చేస్తుంది. 

ముఖంమీద వచ్చే మచ్చలు  మొటిమలు తొలగిపోయే  అవకాశం ఉంటుంది.

కాస్త పెరుగు, శనగపిండి,  కొద్దిగా నిమ్మరసం కలిపి  ముఖానికి రాసుకుని పావుగంట  తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

ఇలా చేయడం వల్ల ముఖం  కాంతివంతంగా ఉంటుంది.

పెరుగుతో పాటూ తేనెను  కూడా కలిపి పూయడం వల్ల  ముఖంలోని జిడ్డు పోయి  నిగారింపు వస్తుంది.

పెరుగును ముఖానికి పూయడం  అందరికీ పడకపోవచ్చు.  అందుకని పెరుగు పూత  వేసుకునే వారు ముందుగా  పరీక్షించుకుని వేసుకోవాలి.