పులులు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. వాటి గురించి చాలా మందికి తెలీని 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పులి పంజాకు మనిషిని చంపేంత శక్తి ఉంటుంది.

పులులు ఎక్కువగా రాత్రి వేళల్లో వేటాడుతుంటాయి.

మగ రాయల్ బెంగాల్ టైగర్లు సుమారు 300 కేజీల వరకు బరువు కలిగి ఉంటాయి.

పులులు నీటిలో ఈత కొట్టడమే కాకుండా చాకచక్యంగా వేటాడగలవు.

ఇవి సుమారు 25 ఏళ్ల పాటు జీవిస్తాయి.

పులులు కొన్నిసార్లు ఆడ సింహాలతో కూడా జతకడుతుంటాయి.

పులులకు లాలాజలం యాంటిసెప్టిక్‌లా పని చేస్తుంది. ఇది గాయాలు మానేందుకు సహకరిస్తుంది.

పులులకు బలమైన కాళ్లు ఉంటాయి. ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు.

పులులు ఎక్కువగా దాక్కుంటూ ఆకస్మిక దాడులు చేస్తుంటాయి.

పులి పిల్లలకు కళ్లు కనపడవు.. దీంతో అవి వాసనను బట్టి తల్లిని అనుసరిస్తాయి.