భారత్‌లోని ఈ ప్రాంతాల్లో  మాంసాహారం నిషేధం..

పాలిటానా సిటీ గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉంది. ప్రపంచంలో మాంసాహారాన్ని నిషేధించిన తొలి నగరంగా ఈ సిటీ రికార్డుల్లోకెక్కింది

రాముడి జన్మస్థలమైన అయోధ్య పట్టణంలో మాంసాహారంపై నిషేధం ఉంది

ఉత్తరాఖండ్‌లోని రిషిఖేష్‌కు మతపరమైన ప్రాధాన్యత ఉంది. అందుకే ఇక్కడ మాంసాహారం, మద్యంపై కొన్నేళ్ల క్రితమే నిషేధం విధించారు. 

గంగానది ఒడ్డున ఉన్న హరిద్వార్‌లో హిందువుల పండుగల రోజుల్లో మాంసాహారం అమ్మకం, కొనుగోలుపై ఆంక్షలు ఉంటాయి. 

రాజస్థాన్‌లోని మౌంట్ అబు జైనులకు ఎంతో పవిత్ర స్థలం. ఆ పవిత్రతను కాపాడటానికి ఇక్కడ గుడ్లు, మాంసాహార అమ్మకాలపై బ్యాన్ ఉంది

శ్రీకృష్ణుడు నడయాడిన క్షేత్రం బృందావన్‌లో మాంసాహారంపై నిషేధం ఉంది.

బ్రహ్మ దేవుడి ఆలయం ఉన్న పుష్కర్‌లో ఏళ్లుగా మాంసాహార నిషేధం అమల్లో ఉంది. 

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఎక్కువగా హిందువులు, జైనులు నివసిస్తుంటారు. దీంతో నగరంలోని ఆలయాల పరిధిలో మాంసాహారం అమ్మకం, కొనుగోళ్లపై కఠిన ఆంక్షలు ఉంటాయి.