షాకింగ్.. ఈ జీవులు  పిల్లల్ని కనగానే చనిపోతాయి..!

ఆడ ఆక్టోపస్‌లు గుడ్లను పొదిగేంత వరకు మాత్రమే బతికి ఉంటాయి. సంతానోత్పత్తి సమయంలో ఆక్టోపస్‌లు ఆహారానికి పూర్తి దూరంగా ఉంటాయి. సంతానోత్పత్తి తర్వాత వాటిలో జరిగే శారీరక మార్పులు మరణానికి కారణమవుతాయి.

సాల్మన్ చేపలు సుదీర తీరాలకు వలస వెళతాయనే సంగతి తెలిసిందే. దూర తీరాల నుంచి వచ్చి గుడ్లు పెట్టిన తర్వాత వాటి శరీరాలు అలసటకు గురై ఎక్కువగా చనిపోతుంటాయి.

గొల్ల భామలు సంభోగం తర్వాత మగ వాటిని తినేస్తాయి. ఫలితంగా అవి ప్రాణాలు కోల్పోతాయి.

బ్లాక్ విడో స్పైడర్‌లు కూడా సంభోగం తర్వాత మగ వాటిని తినేస్తాయి.

ఊల్ స్పైడర్ కోతులు ప్రసవ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. పిల్లల్ని కనే క్రమంలో 90 శాతం స్పైడర్ కోతులు ప్రాణాలు కోల్పోతాయి.

కటిల్ ఫిష్ సంభోగం తర్వాత గుడ్లు పెట్టిన కొద్ది రోజులకే వృద్ధాప్యానికి గురై ప్రాణాలు కోల్పోతుంది.

ఆఫిడ్స్ అనే కీటకాలు పురుష సంభోగం లేకుండా పునరుత్పత్తి చేస్తాయి. సంతానానికి జన్మనిచ్చిన తర్వాత ఆఫిడ్స్ చనిపోతుంటాయి.

గుడ్లను ఉత్పత్తి చేయడం, వాటిని సంరక్షించడం వంటి ప్రక్రియల కారణంగా రెడ్ బ్యాక్ స్పైడర్స్ తీవ్ర శారీరక మార్పులకు లోనై ప్రాణాలు కోల్పోతాయి.