చేపల పచ్చడి ఇలా పెట్టుకోండి అదిరిపోతుంది..
ముందుగా చేపలను కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
తరువాత చేప ముక్కలకు పసుపు, ఉప్పు పట్టించాలి.
పాన్లో నూనె వేసి ఆ చేప ముక్కలు వేసి వేగించాలి.
మిక్సీలో ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, ఎండుద్రాక్ష, గసగసాలు వేసి మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి.
చిన్న పాత్రలో కొన్ని నీళ్లు పోసి చింతపండు నానబెట్టాలి.
అల్లం వెల్లుల్లిని పేస్టు చేసుకోవాలి. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.
కాసేపు వేగిన తరువాత మసాలా పేస్టు వేసి కలపాలి.
ఇప్పుడు చింతపండు నీళ్లు పోసి, ఉప్పు, పంచదార వేసి కాసేపు ఉడికించాలి.
పచ్చిమిర్చి, ఆవాలు వేయాలి. చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
Related Web Stories
2025లో ఈ దేశాలు చాలా సంతోషంగా ఉన్నాయంట..
గంజి నీళ్లు పారబోస్తున్నారా? ఇలా చేస్తే సమస్య తీరుతుంది
మీ కారులో ఇవి లేకపోతే చిక్కులే
కరకరలాడే క్యాబేజి పకోడి.. ఇలా చేస్తే ఇంట్లోనే క్యాటరింగ్ టేస్ట్