నిర్మలా సీతారామన్ గురించి మీకు తెలియని నిజాలివీ..!

భారతదేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అందరికీ సుపరిచితురాలు. అయితే ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలున్నాయి.

నిర్మలా సీతారామన్ 1959, ఆగస్థు 18న తమిళనాడు రాష్ట్రం మధురైలో జన్మించారు.  కళాశాల విద్యను తిరుచిరాపల్లిలో అభ్యసించారు.

జె ఎన్ యు విశ్వవిద్యాలయం  నుండి మాస్టర్స్ చేశారు. 

2003-05 మధ్య జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు.

2008లో బీజేపీలో చేరారు.

2014లో ప్రధానమంత్రి మోడీ క్యాబినెట్ లో జూనియర్ మంత్రి అయ్యారు.

2017లో భారతదేశపు మొదటి మహిళా రక్షణ మంత్రి అయ్యారు.

2019లో భారతదేశ మొదటి మహిళా ఆర్థిక మంత్రి అయ్యారు. ఇప్పటికి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు.