ట్యాంక్‌బండ్‌‌పై విల్లు పట్టుకుని కోర మీసాలతో కనిపించే విగ్రహం ఎవరిదో తెలుసా

భారత స్వాతంత్ర్య  చరిత్రలో ఆయనొక మహోజ్వల శక్తి.

బ్రిటీష్ సైన్యాన్ని వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు

తెల్ల దొరలకు సింహస్వప్నంగా  నిలిచిన పోరాట యోధుడు

అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఓ అధ్యాయం.

సాయుధ పోరాటం ఒక్కటే అని నమ్మిన అల్లూరి.. తన పోరాట పటిమతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించారు

గిరిజనులను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు.

మన్యం దొరగా పేరున్న సీతారామారాజు.. స్వాతంత్ర్యంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారు. 

విశాఖ జిల్లా పాండ్రంగిలో 1897 జూలై 4న అల్లూరి జన్మించారు.

ఆయన స్వగ్రామం  పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు.

1922లో మన్యం తిరుగుబాటును ప్రారంభించారు సీతారామరాజు.. 

రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో దాడిచేశారు.

ఇప్పటికీ సీతారామరాజు దాడి చేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్‌ కనిపిస్తుంది.