మట్టి కుండలో నీరు త్రాగడం వల్ల కలిగే  8 ప్రయోజనాలు ఇవే..

మన పురాతన కాలం నుంచి వస్తున్న మట్టి కుండలోని నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. 

పొరస్ గోడల కారణంగా మట్టికుండలలో నీరు చల్లగా మారుతుంది. వేడి వాతావరణం రిఫ్రెష్ గా నీటిని అందిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా. 

కుండ ఉన్న ఆకారాన్ని బట్టి నీటిని కొద్దిగా ఆల్కలైజ్ చేస్తుంది. ఇది శరీరంలో ఆమ్లతను పెంచుతుంది.

మట్టి కుండ మినరల్ ఎన్రిచ్మెంట్.. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు నీటికి అందిస్తుంది. ఆరోగ్యాన్ని పెంచుతుంది. 

మట్టి కుండలలో నీరు మట్టి సువాసనతో ఉండి కమ్మని, త్రాగే అనుభూతిని పెంచుతుంది. 

కెమికల్ లీచింగ్ లేకుండా, ప్లాస్టిక్ కాకుండా మట్టి కుండలో హానికరమైన రసాయనాలుండవు. ఈ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. 

ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో వాటికి దూరంగా మట్టి పాత్రలలో నీరు తాగడం అనేది ఎప్పుడూ మంచిదే.. దీనితో చాలా రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించవచ్చు.

కుండ నీరు జీర్ణశక్తిని పెంచుతుంది. మట్టికుండలోని నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల ఆహారం విచ్ఛిన్నం చేయడంలో సహకరిస్తుంది. 

మట్టి కుండలో నీరు తీసుకోవడం వల్ల ఆల్కలీన్ PH, మినరల్ కంటెంట్, పోషకాలు సులభంగా అందుతాయి.

మట్టి కుండలో నీటిని తాగుతూ ఉంటే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. ఇది శరీరంలో పేరుకున్న టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది.