ఒత్తిడి.. ఆయువును తినేస్తోంది.. ఎన్ని రోగాలు తెస్తోందంటే..

ప్రస్తుత సమాజంలో మధుమేహం విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆందోళన. వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఏర్పడుతోంది.

మనలో ఒత్తిడి పెరిగినపుడు అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి రక్తపోటును, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

రోగ నిరోధక శక్తి మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. కానీ, నిరంతర ఒత్తిడి రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. ఫలితంగా అనేక ఇన్ఫెక్షన్లు దరి చేరతాయి.

వయసుతో సంబంధం లేకుండా అందరూ బీపీ (రక్తపోటు) బారిన పడడానికి ఈ స్ట్రెస్ మూల కారణం.

క్రానిక్ స్ట్రెస్ (నిరంతర ఒత్తిడి) వల్ల గుండె పోటు బారిన పడడం కూడా జరుగుతుంటుంది. అలాగే దీర్ఘకాలిక గుండె జబ్బులు కూడా వస్తుంటాయి.

ఒత్తిడిలో ఉన్నప్పుడు సాధారణం కంటే ఎక్కువగా తినేస్తుంటాం. ఫలితంగా బరువు పెరగడం, ఇతర లైఫ్‌స్టైల్ వ్యాధుల బారిన పడడం జరుగుతోంది.

ఒకేసారి ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతే మెదడులో రక్తనాళాలు పగలిపోతాయి. ఫలితంగా పక్షవాతం కూడా రావొచ్చు.

ఒత్తిడి అధికమైనపుడు శరీరరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యలు మొదలవుతాయి.