బంగారం లాంటి గ్లో కావాలంటే.. పసుపుతో చేసిన ఈ సీరమ్ వాడండి..!

పసుపులో యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి.

పసుపును రెగ్యులర్ గా వాడుతుంటే ముఖం పై మచ్చలు, మంగు వంటివి తొలగిపోతాయి.

పసుపు సీరమ్ ఇంట్లోనే తయారు చేసి వాడితే ముఖం బంగారంలా మెరుస్తుంది.

పసుపు సీరమ్ ఇంట్లోనే ఎలా తయారు చేయలో.. కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే..

ఒక చెంచా బాదం నూనెలో రెండు స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి.

ఒక చెంచా గ్లిజరిన్,  అరచెంచా పసుపు,  ఒక విటమిన్-ఇ క్యాప్సూల్ బాదం నూనె మిశ్రమంలో కలపాలి. ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి.

పదార్థాలను అన్నింటిని బాగా మిక్స్ చేసి ఒక కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి.  

పసుపు సీరమ్ ను రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తరువాత అప్లై చేయాలి.  

రోజూ రాత్రి సమయంలో దీన్ని వాడుతుంటే ముఖం బంగారంలా మెరుస్తుంది.