వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తన సతీమణి సునేత్రాను అజిత్ పవార్ బరిలోకి దింపనున్నారు.

బారామతి నుంచి శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 నుంచి వరసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు.

ఈ సారి సుప్రియాపై ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ పోటీకి దిగుతారని తెలుస్తోంది.

బారామతి నియోజకవర్గంలో సునేత్ర పవార్ ప్రచారం చేస్తున్నారు. సునేత్రా పవార్ 2019 లోక్ సభ ఎన్నికల్లో మావల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

బారామతి అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలు శరద్ పవార్ కంచుకోట. శరద్ పవార్ 1967, 1972, 1978, 1980, 1985, 1990లో ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి, గెలిచారు.

1984, 1996, 1998, 1999, 2002లో బారామతి లోక్ సభకు శరద్ పవార్ పోటీ చేసి విజయం సాధించారు.