తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 21వ తేదీన పంజాబ్ వెళతారు.

స్వర్ణ దేవాలయంలో మమతా బెనర్జీ ప్రత్యేక పూజలు చేస్తారు.

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో మమతా బెనర్జీ భేటీ అవుతారు.

ఇండియా కూటమిలో భాగస్వాములుగా టీఎంసీ, ఆప్ ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చాయి.

పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నిరసన చేస్తున్న రైతులపై పోలీసుల దాడిని మమతా ఖండించారు.