గ్రూప్-1 బాధితులకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు

 బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ బయలుదేరి వెళ్లారు

 సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసి గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు

 రాముడి వనవాసం మాదిరిగా 12 ఏళ్లపాటు పరీక్షల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు

 ఎలాగైన తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు వేడుకున్నారు

 బాధితుల పక్షాన బీజేపీ సైతం పోరాడుతుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు

 రాష్ట్ర ప్రభుత్వం జీతాలిచ్చే పరిస్థితి లేక 

 ఏదో ఒక లిటిగేషన్ పెట్టి గ్రూప్-1 పరీక్షలు వాయిదా పడేలా చేస్తోంది

రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా 29 జీవోను జారీ చేసిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు