బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ చేరుకున్న ప్రధాని మోదీ

అక్టోబర్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కజాన్‌లో బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నారు

కజాన్ చేరుకున్న ప్రధాని మోదీకి అఖండ స్వాగతం లభించింది

ప్రధాని మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి

బ్రిక్స్‌ అధ్యక్ష పదవి విజయవంతం చేసినందుకు రష్యాను అభినందించారు మోదీ

చాలా దేశాలు ఈ గ్రూప్‌లో చేరాలనుకుంటున్నాయని తెలిపారు

కజాన్ లాంటి అందమైన నగరానికి రావడం సంతోషం గా ఉందని మోదీ అన్నారు

మూడు నెలల్లో రెండవ రష్యా పర్యటన భారత్, రష్యా బలమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తుందన్నారు

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రధాని మోదీ తెలిపారు

ఈ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని విశ్వసిస్తున్నామన్నారు