సీఎం చంద్రబాబుకు  తప్పిన పెను ప్రమాదం..

భారీ వర్షాల కారణంగా పొంగిన  వరదలు ఇంకా విజయవాడను వీడలేదు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు

ఈ క్రమంలో స్వయంగా  క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు

ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు  మధురానగర్ రైల్వే ట్రాక్‌పై  నడుచుకుంటూ వెళ్తున్నారు

అదే సమయంలో ట్రాక్‌పై  నుంచి ట్రైన్ వస్తోంది

ఇది గమనించిన భద్రతా సిబ్బంది..  ట్రైన్ వస్తోందని, అక్కడి నుంచి వెళ్దామని చెప్పారు

మరోవైపు విషయాన్ని గమనించిన  చంద్రదండు కార్యకర్తలు..  లైన్‌మెన్‌ను అలర్ట్ చేశారు.

అతను ఎర్రజెండా ఊపడంతో  ట్రైన్ స్లో అయ్యింది

మూడు అడుగుల దూరంలో  ట్రైన్ ఆగిపోవడంతో. భద్రతా  సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు