శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో  సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు.

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు  సతీసమేతంగా సీఎం చంద్రబాబు దంపతులు  హాజరయ్యారు. 

చంద్రబాబు దంపతులకు టీటీడీ ఈవో శ్యామలరావు ఐఏఎస్., అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఐఏఎస్ స్వాగతం పలికారు.

ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

తిరుమలలో వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని ఆలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు.

  రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో పండితులు సీఎం చంద్రబాబు దంపతులను ఆశీర్వదించారు. 

వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామి వారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు