దజీట్ సీఎం చంద్రబాబు..  అర్థరాత్రి కూడా..

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరు వానలో ఆదివారం అర్ధరాత్రి సింగ్‌నగర్ వెళ్లారు. 

 బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్ళానని చెప్పారు.

సోమవారం ఉదయానికల్లా బోట్లు, హెలికాప్టర్ అందుబాటులోకి వస్తాయన్నారు. 

బుడమేరు బాధితులు కట్టుబట్టలతో బయటకు వస్తున్నారని..వాళ్లకు దుస్తులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వాటితోపాటు దుప్పట్లు కూడా సరఫరా చేయాలని ఆదేశించారు.

అండగా ఉంటామని బాధితులకు సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు.

అందరికీ ఆహారం, నీళ్ళు సరఫరా చేస్తున్నామని చెప్పారు.8.  ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112, 1070 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

తెల్లవారుజామున మూడు గంటల వరకూ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు పర్యటించారు.