మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని ముఖ్యమంత్రి విమర్శించారు.

సెక్రటేరియట్ ముందు  కేటీఆర్ వాళ్ల  అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారని ఆరోపించారు.

అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడటం  సరికాదని అన్నారు.

చేతనైతే ఎవరైనా విగ్రహంపై చేయి వేయండి అని సవాల్ విసిరారు.

‘నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా’ అని ప్రశ్నించారు.

డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వారు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.