డ్రోన్‌ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌ కానుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు

విజయవాడ వరదల్లో డ్రోన్లు వినియోగించి ఆహారం, తాగునీరు అందించామని చెప్పారు

 మంగళగిరిలోని ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు

 ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీలో భారతీయులు సమర్థులని సీఎం కొనియాడారు

 విదేశాల్లో ఉన్న మనదేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారే ఉన్నారని చెప్పారు

ఇప్పుడు నిజమైన సంపద డేటా,భవిష్యత్తులో దేశానికైనా, కంపెనీకైనా అదే కీలకం

 డేటాకు ఏఐను అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లుది కీలకపాత్ర

 పోలీసుశాఖలో విస్తృతంగా ఉపయోగించేందుకు కృషి చేస్తాం

డ్రోన్లతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారికి చెక్‌ పెడతాం అని చంద్రబాబు తెలిపారు