హైడ్రా ఆర్డినెన్స్‌కు గర్నవర్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది

రాష్ట్రంలోని చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దింపింది

ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది

పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. హైడ్రా చట్టబద్ధతపై కోర్టు కూడా ప్రశ్నించింది

జీవో 99‌పై స్టే ఇవ్వాలంటూ అనేక మంది హైకోర్టులో పిటిషన్‌లు వేశారు

జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు

ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టం రూపొందించారు

ఈ ఆర్డినెన్స్‌‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు