కయ్యానికి కాలు దువ్వే శత్రుదేశాల పీచమణిచేందుకు భారత్ ఎన్నో క్షిపణులను సిద్ధం చేసుకుంది.

వీటిని ప్రయోగిస్తే శత్రుమూకలు క్షణాల్లో మట్టిలో కలిసిపోతాయి.

అయితే, భారత అమ్ములపొదిలోని అగ్నీ సిరీస్‌కు చెందిన క్షిపణులు అత్యంత శక్తిమంతమైనవి

అగ్నీ-5 క్షిపణి అత్యంత దీర్ఘశ్రేణి ఆయుధం. 5000- 8000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది.

ఈ మిసైల్‌తో అణ్వాయుధాలను కూడా ప్రయోగించొచ్చు

అగ్నీ-4 మిసైల్ ఈ సిరీస్‌లో రెండో స్థానంలో ఉంది. దీని రేంజ్ 3500-4000 కిలోమీటర్లు

5 వేల నుంచి 8 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే కే-5, కే-6 మిసైళ్లను భారత్ అభివృద్ధి చేస్తోంది

ఇక 12 వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను ధ్వంసం చేసే అగ్నీ-6పై కూడా భారత్ పరిశోధనలు చేస్తోంది.