తిరుమల పర్యటన  రద్దు చేసుకున్న జగన్

మాజీ ముఖ్యమంత్రి,  వైఎస్సార్సీపీ అధినేత వైఎస్  జగన్ తిరుమల పర్యటన రాష్ట్ర  వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది

 జగన్‌ తిరుమలకు రావొద్దంటూ  హిందూ సంఘాలు, కూటమి  నేతలు పట్టుబడుతున్నారు

జగన్ తిరుమలకు వస్తే  కచ్చితంగా అడ్డుకుని  తీరుతామని స్పష్టం చేస్తున్నారు

ఈ క్రమంలో జగన్ పర్యటన  రద్దు కావడం హాట్  టాపిక్‌గా మారింది

జగన్ డిక్లరేషన్ ఇస్తేనే  గుడిలోకి అడుగుపెట్టాలని  హిందూ సంఘాలు సహా,  కూటమి నేతలు డిమాండ్  చేస్తున్నారు

మరోవైపు తిరుమలకు  రావొద్దంటూ అలిపిరి వద్ద  పలువురు స్వాములు  ఆందోళనకు దిగారు

గో బ్యాక్ జగన్‌ అంటూ  శ్రీనివాసానంద స్వామీజీతో  పాటు పలువురు స్వాములు  నిరసన చేపట్టారు

 గో బ్యాక్ క్రిస్టియన్ జగన్  అంటూ ప్లకార్డులు చేతబట్టి  నినాదాలు చేశారు

జగన్‌.. మీరు తిరుమలకు  రావొద్దు. వస్తే అడ్డుకుని  తీరుతాం అని స్వామీజీలు  పేర్కొన్నారు

మీ వాహనాలు మా  సాధుసంతులు, హిందువుల  శరీరాల పైనుంచి వెళ్లాల్సిందేతప్ప  మిమ్మల్నైతే ఒక్క అడుగు  ముందుకు వెళ్లనివ్వం అని  శ్రీనివాసానంద స్వామి  స్పష్టం చేశారు

శాంతి భద్రతల సమస్య  తలెత్తితే జగన్‌ బాధ్యత  వహించాల్సి ఉంటుంది 

హిందూ ధర్మానికి, వేంకటేశ్వర  స్వామికి కళంకం తెచ్చిన,  ప్రసాదాన్ని పాడుచేసిన,  జగన్మోహన్‌రెడ్డిని ఒక్క  అడుగుకూడా ముందుకు  వేయనివ్వం అని స్వాములు  ఆందోళనకు దిగారు

మీ నిర్వాహకంతో  హిందువులంతా తీవ్ర  ఆవేదనలో ఉన్నారు అని  స్వామీజీలు పేర్కొన్నారు

జగన్‌కు వ్యతిరేకంగా  తిరుపతి వీధుల్లో డిక్లరేషన్  ఫ్లెక్సీలు వెలిశాయి

ఆలయంలోకి ప్రవేశించాలంటే అనుసరించాల్సిన నియమ,  నిబంధనలను ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు