సినీ హీరో నారా రోహిత్, హీరోయిన్ శిరీషా లెల్ల  ఓ ఇంటివారు కాబోతున్నారు.

వారిద్దరి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో అక్టోబర్ 13న ఘనంగా జరిగింది.

వీరిద్దరూ కలిసి నటించిన ‘ప్రతినిధి 2’ సినిమా సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది.

ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించగా ఆదివారం నాడు నిశ్చితార్థం జరిపించారు.

నిశ్చితార్థానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఎంగేజ్‌మెంట్‌ ఫొటోల్లో నూతన జంట ఎంతో ఆనందంగా, హుషారుగా కనిపిస్తున్నారు.

సంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నారా రోహిత్, శిరీషా లెల్ల వివాహం డిసెంబర్ 15న జరగనున్నట్లు తెలుస్తోంది.