బర్రెలక్క బాటలోనే.. పాలిటిక్స్‌లోకి రైతుబిడ్డ ఎంట్రీ!

సోషల్ మీడియా పుణ్యమా అని బర్రెలక్కగా తనకు మంచి పాపులారిటీ రావడంతో.. శిరీష రాజకీయాల్లోకి వచ్చి పెను సంచలనమే సృష్టించింది.

ఇప్పుడు బర్రెలక్క బాటలోనే.. బిగ్‌బాస్ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్ (రైతు బిడ్డ) కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

మీ అందరి ఆశీస్సులు ఉంటే, పార్లమెంట్ దాకా కూడా వెళ్తానంటూ.. ఓ సినిమా ఈవెంట్‌లో రైతుబిడ్డ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

యువత మేలుకోవాలి, ముందడుగు వేయాలి, అప్పుడే సమాజం బాగుపడుతుందని చెప్పడం చూస్తే.. పాలిటిక్స్‌లోకి రావొచ్చని అనిపిస్తోంది.

మనల్ని మనం నమ్ముకోవాలని, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా గట్టిగా నిలబడాలని, తానూ అలాగే నిలబడ్డానని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నాడు.

ఇంకా ఎన్ని దెబ్బలు తాకినా భయపడనని, రైతుబిడ్డ తలచుకుంటే ఏదైనా సాధిస్తాడంటూ.. ఆ సినిమా ఈవెంట్‌లో రైతుబిడ్డ చెప్పుకొచ్చాడు.

ఇంతలో ఆ ఈవెంట్‌లో ఉన్న శివాజీ.. పార్లమెంట్‌దాకా కూడా వెళ్తాడని చెప్పడంతో.. అందరి ఆశీస్సులుంటే అది కూడా జరుగుతుందని అన్నాడు.

రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంది కాబట్టే.. తన మనసులోని మాటని పల్లవి ప్రశాంత్ బయటపెట్టాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బర్రెలక్క ఎలాగైతే సెన్సేషన్ క్రియేట్ చేసిందో, తాను కూడా అలాగే రాజకీయాల్లో సత్తా చాటాలని రైతుబిడ్డ భావిస్తున్నాడని కామెంట్లు వస్తున్నాయి.