ముచ్చటగా మూడోసారి కొలువు తీరిన మోదీ ప్రభుత్వం.

లఖ్‌నవూ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ నాయకుడు కె. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు జి.కిషన్ రెడ్డి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 

కరీంనగర్ ఎంపీ, బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.  

గుంటూరు ఎంపీ, టీడీపీ నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.