మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది

ప్రస్తుతం జైల్లో ఉన్న బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటించింది

ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో విడుదల చేసినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి

లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా వారి భద్రత

కుటుంబ భవిష్యత్తు కోసం రూ.కోటికి పైగా ఇస్తాము

ఈ గ్యాంగ్‌ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం,

గుజరాత్‌ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు

మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదు

కాగా 2023, డిసెంబర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీని కాల్చి చంపారు

ఆయనను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది