కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఉచిత డయాలసిస్‌ పథకాన్ని సైనీ ప్రకటించారు

 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెరవేర్చారు

 భవిష్యత్తులో అన్ని మెడికల్ కాలేజీల్లో ఉచిత డయాలసిస్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు

 హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలమంది పేద ప్రజలకు లబ్ధిచేకూరనుంది

నాయబ్ సింగ్ సైనీ రెండోసారి హర్యానా ముఖ్యమంత్రి అయ్యారు

 సీఎం సైనీతో పాటు 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు

హర్యానాలో ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుని చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది

 గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి 48 సీట్లు గెలుచుకుంది

 గురువారం జరిగిన సైనీ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, అమిత్ షా,

రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు ఎన్డీయే నేతలు హాజరైన విషయం తెలిసిందే