రోహిత్ సిక్స్.. బాహుబలి సీన్ రిపీట్

ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

ఎంఐ మాజీ సారథి రోహిత్ బ్యాటింగ్‌కు రాగానే వాంఖడే స్టేడియంలో ఈలలు, చప్పట్లు మొదలయ్యాయి.

హిట్‌మ్యాన్ తొలి సిక్స్ కొట్టగానే స్టేడియం దద్దరిల్లింది. అంతా రోహిత్.. రోహిత్ అంటూ గట్టిగా అరిచారు.

ఆ సమయంలో సౌండ్ మీటర్‌ను పరిశీలించగా.. సౌండ్ 129 డెసిబల్స్‌గా నమోదైంది. ఈ సీజన్‌లో హయ్యెస్ట్ సౌండ్ ఇదే.

ఈ మోతాదులో శబ్దాన్ని తరచూ వింటే చెవులు పాడవక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక్క షాట్‌తో రోహిత్ నేరుగా మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్‌తో పాటు టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లలో గేమ్‌ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్‌లో జోష్ తీసుకొచ్చాడు

బాహుబలి 2 మూవీ ఇంటర్వెట్ పట్టాభిషేకం సీన్‌ను రోహిత్ రిపీట్ చేశాడు. బాహుబలి జయహో.. అంటూ ప్రజలు అరుస్తారు. ఇవాళ రోహిత్ ఒక్క సిక్స్‌తో గ్రౌండ్ మొత్తాన్ని సౌండ్‌తో ఇలాగే షేక్ చేశాడని అంటున్నారు నెటిజన్స్.