ఐపీఎల్‌కు గుడ్‌బాయ్ చెప్పనున్న రోహిత్ శర్మ?

ఐపీఎల్ 2024లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్ రేసులో లేదు

కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది

నేటి మ్యాచ్‌కు ముందు తన పాత స్నేహితుడిని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

వీడియోలో KKR జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ శర్మ మాట్లాడటం కనిపించింది

ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ వారి సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసింది

వీడియోలో అభిషేక్ నాయర్‌తో రోహిత్ ఇలా అన్నారు. ఇప్పుడు ముంబై మునుపటిలా ఏమీ లేదు, ప్రతిదీ మారిపోయింది

ఇది నేను నిర్మించిన ఆలయం. ఏది ఏమైనా, ఇదే నా ఇల్లు, నా సోదరుడు

ఇవేమి నేను పట్టించుకోను. ఇది నా చివరి సంవత్సరం అని పేర్కొన్నారు

ఈ వీడియో చూసిన పలువురు ఔనని అంటుండగా, మరికొంత మంది మాత్రం అలాంటిది ఏమి ఉండదని చెబుతున్నారు

కానీ రోహిత్ శర్మ, అభిషేక్ మధ్య సంభాషణ మొత్తం స్పష్టంగా లేదని చెప్పవచ్చు

దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు పలురకాలుగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు