IPL 2025: ఈ సీజన్లో
300 కొట్టే సత్తా ఉన్న జట్లు ఇవే..
ఐపీఎల్లో 300 పరుగులు చేసే సత్తా ఉన్న జట్టు ఏది అంటే అందరికీ మొదట గుర్తుకొచ్చే పేరు సన్రైజర్స్ హైదరాబాద్. చాలా సార్లు 300 దగ్గరకు కూడా వచ్చింది.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసీన్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి వంటి హార్డ్ హిట్టర్లు ఎస్ఆర్హెచ్లో ఉన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ టీమ్ నాలుగు సార్లు 250 ప్లస్ పరుగులు చేసింది. ఈ సీజన్లోనే 300 మార్క్కు కూడా చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ సీజన్లో అత్యంత బలంగా మారిన జట్టు పంజాబ్ కింగ్స్. ఆ జట్టులోని ఆటగాళ్లను చూస్తే 300 పరుగుల మార్క్కు చేరుకునే సత్తా ఉన్నట్టే కనిపిస్తోంది.
పంజాబ్ టీమ్లో శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జాష్ ఇంగ్లిష్, నేహల్ వదేరా లాంటి హిట్టర్లు ఉన్నారు.
ఎస్ఆర్హెచ్ తర్వాత ఆ స్థాయి హిట్టర్లు ఉన్న టీమ్ ముంబై ఇండియన్స్ జట్టు. ముంబై టీమ్కు కూడా 300 పరుగుల మార్క్కు చేరుకునే సత్తా ఉంది.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు ముంబై టీమ్లో ఉన్నారు.
పంత్ సారథ్యంలోని లఖ్నవూ కూడా బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉంది. ఈ జట్టుకు కూడా 300 మార్క్ చేరుకునే సత్తా ఉంది.
మిచెల్ మార్ష్, మార్క్రమ్, నిలకోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, రిషభ్ పంత్లతో కూడా బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.
Related Web Stories
ధోనీని భయపెట్టిన ఆటోడ్రైవర్ కొడుకు.. టాలెంట్ అంటే ఇది
IPL: ఐపీఎల్లో చెత్త రికార్డు.. ఈ బ్యాటర్లే టాప్..
మెరుపును మించిన వేగం.. మిల్లీ సెకన్లలో చేసిన అద్భుతం, మనిషా.. రోబోనా..
టాటూలు వేసుకున్న భారత క్రికెటర్లు..