Share News

Stock Market: భారీ నష్టాల నుంచి లాభాల్లోకి.. సెన్సెక్స్ 599 పాయింట్లు ప్లస్..!

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:02 PM

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కలవరపెట్టడంతో భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాల్లోకి పయనించాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ మిసైల్ ఎటాక్‌కు దిగిందనే వార్తల నేపథ్యంలో మార్కెట్ అప్రమత్తమైంది.

Stock Market: భారీ నష్టాల నుంచి లాభాల్లోకి.. సెన్సెక్స్ 599 పాయింట్లు ప్లస్..!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కలవరపెట్టడంతో భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాల్లోకి పయనించాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ మిసైల్ ఎటాక్‌కు దిగిందనే వార్తల నేపథ్యంలో మార్కెట్ అప్రమత్తమైంది. అయితే తమ మీద మిసైల్ ఎటాక్ జరగలేదనే ఇరాన్ ప్రకటన మదుపర్లకు భరోసాను ఇచ్చింది. దీంతో దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. (Business News).


శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కొద్దిసేపు నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. 71,816 వద్ద ఇంట్రాడే లోని తాకింది. మధ్యాహ్నం తర్వతా బాగా పుంజుకుంది. ఏకంగా 599 పాయింట్లు లాభపడింది. ఇంట్రాడే నష్టంతో పోల్చుకుంటే 1270 పాయింట్లు ఎగబాకింది. చివరకు 73,088 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా భారీ నష్టాల నుంచి కోలుకుని 151 పాయింట్లు లాభపడి 22,147వద్ద రోజును ముగించింది.


బ్యాంక్ నిఫ్టీ 504 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 298 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌లో ప్రధానంగా ఆర్‌బీఎల్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్కార్ట్స్ కుబోటా, ఎమ్ అండ్ ఎమ్ లాభాలను ఆర్జించాయి. టాటా కమ్యూనికేషన్, లూపిన్, కమిన్స్, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్సియల్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి..

Acquisition: ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థను కొనుగోలు చేసిన ఐటి సంస్థ


Ekagrah Rohan: 5 నెలల బుడ్డోడు, రూ. 4.2 కోట్లు దక్కించుకున్నాడు.. ఎలాగంటే


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 04:02 PM