Home » LATEST NEWS
అమేథీ నుంచి రాయబరేలికి రాహుల్ గాంధీ పారిపోయారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ కొట్టివేసింది. చెస్, రాజకీయాల్లో నిష్ణాతుడైన ఆటగాడుగా రాయబేరిలి నుంచి పోటీ చేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ ఇన్చార్జ్ జైరామ్ రమేష్ చెప్పారు.
రాయబరేలి నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం ఖరారు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. అమేథీలో పోటీకి బయపడే ఆయన రాయబరేలి వైపు పరిగెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గం నుంచి శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన వెంట సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రా హాజరయ్యారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) ముందు మంత్రి రోజాకు (Minister Roja) భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా ఆమెతో పాటు ఉన్న వైసీపీ కీలక నేతలు రోజా వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. ఆమె వైఖరి నచ్చక పలువురు నేతలు జగన్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో మంత్రి రోజా తీరుపై ఆగ్రహంతో నగరిలోని 5 మండలాల వైసీపీ నేతల రాజీనామాలు చేశారు.
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వ్యూస్, లైక్ల కోసం కొందరు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు తమ ఇళ్లల్లోని పాత వస్తువులతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు.. .
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో సారి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ప్రత్యర్థి, సీపీఎం నాయకురాలు అన్నీ రాజా శుక్రవారం స్పందించారు.
గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని రెండు రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 6, 8 తేదీలలో ప్రధాని మోదీ, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈనెల 6వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజమండ్రి ఎయిర్పోర్టుకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయ్..! దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు చివరి అస్త్రాలుగా ఏమున్నాయా..? అని బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే.. కీలక నేతలు, పార్టీల అధిపతులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ (YSR Congress) ఓ రేంజిలో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం (Pithapuram) నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (Pawan Kalyan) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) ఉసిగొల్పింది వైసీపీ..
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క సీట్ కూడా గెలవదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మెజార్టీ పార్లమెంట్ స్థానాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.