ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:33 AM
ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
గంభీరావుపేట, ఏప్రిల్ 19: ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్, ముచ్చర్లలోని ఆరోగ్య సబ్ సెంటర్లను శుక్ర వారం తనిఖీ చేశారు. సముద్ర లింగాపూర్ వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దంత వైద్య శిబిరం, రోగులకు అందిస్తున్న సేవలు, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. డీఎంహెచ్వో డాక్టర్ సుమన్ మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ ఉమా దేవి, మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్రావు, ఎంఎల్హెచ్పీలు శివాని, వనజ పాల్గొన్నారు.