Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌పై ఈ రోజే విచారించేలా న్యాయవాది లూథ్రా ప్రయత్నాలు...

ABN , First Publish Date - 2023-09-27T15:39:54+05:30 IST

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను వారంపాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎస్‌వీఎన్ భట్టి చంద్రబాబు కేసును విచారించడానికి నిరాకరించినప్పటికీ ఏదో ఒక ధర్మాసనం ముందు ఈ రోజే (బుధవారం) విచారణకు వచ్చేలా చూడాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌పై ఈ రోజే విచారించేలా న్యాయవాది లూథ్రా ప్రయత్నాలు...

న్యూఢిల్లీ: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను వారంపాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎస్‌వీఎన్ భట్టి చంద్రబాబు కేసును విచారించడానికి నిరాకరించినప్పటికీ ఏదో ఒక ధర్మాసనం ముందు ఈ రోజే (బుధవారం) విచారణకు వచ్చేలా చూడాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. న్యాయవాది లూథ్రా వెంటనే సీజేఐ ధర్మాసనం ముందుకెళ్లారు. ఇందులో భాగంగా సీజేఐ ధర్మాసనం ముందు ఆయన వేచిచూస్తున్నారు. ఈరోజే వేరే ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్ విచారించాలని సిద్ధార్థ లూథ్రా కోరనున్నారు. వేరే ధర్మాసనం కాకపోతే స్వయంగా సీజేఐ ధర్మాసనం వినాలని సిద్ధార్థ లుథ్రా అభ్యర్థించనున్నారు.


చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

అంతకుముందు... సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడిన విషయం తెలిసిందే. వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి సరస వెంకట నారాయణ భట్టి విచారణకి విముఖత వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా పడింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ కోసం ఎంతో ఉత్కంఠగా నెలకొన్నప్పటికీ మరో వారంపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ఏపీ హైకోర్ట్ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-27T15:40:37+05:30 IST