చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:47 AM
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం జిల్లాకు వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ఉదయం 10.40 గంటలకు గూ డూరు చేరుకుంటారు.
తిరుపతి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం జిల్లాకు వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ఉదయం 10.40 గంటలకు గూ డూరు చేరుకుంటారు. అక్కడి సీఆర్ కళ్యాణ మండపంలో 11 నుంచీ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మహిళలతో జరిగే ముఖాముఖీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనం గూడూరులోనే ముగించుకుని 2 గంటలకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు వెళతారు. బహిరంగసభలో పాల్గొని సాయంత్రం 5.30 గంటలకు సత్యవేడు చేరుకుంటారు.6 నుంచీ 7.30 గంటల వరకూ సత్యవేడు క్లాక్ టవర్ కూడలిలో జరిగే ప్రజాగళం బహిరంగసభలో పాల్గొంటారు.అనంతరం తిరుపతికి చేరుకుని రాత్రి బస చేస్తారు.గూడూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు అధినేత పర్యటనను ప్రతిష్టాత్మకంగగా భావిస్తున్నాయి. ఎన్నికల వేళ అఽధినేత పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ అభ్యర్థులు, ముఖ్యనేతలు సైతం గట్టిగా ప్రయత్రిస్తున్నారు. అందులో భాగంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.