రేపు గూడూరుకు చంద్రబాబు
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:23 AM
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 20న, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 29న జిల్లాకు రానున్నారు. శనివారం ఉదయం చంద్రబాబు గూడూరు చేరుకుంటారు. అక్కడ ఆర్టీసీ బస్టేషన్ సమీపంలోని సీఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొంటారు.
తిరుపతి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 20న, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 29న జిల్లాకు రానున్నారు. శనివారం ఉదయం చంద్రబాబు గూడూరు చేరుకుంటారు. అక్కడ ఆర్టీసీ బస్టేషన్ సమీపంలోని సీఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం గూడూరు నుంచీ నెల్లూరు జిల్లా సర్వేపల్లి వెళ్ళి అక్కడ జరిగే బహిరంగసభకు హాజరవుతారు. అక్కడి నుంచీ సాయంత్రం తిరిగి సత్యవేడుకు చేరుకుని బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. గూడూరులో అదే రోజు టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ నామినేషన్ కార్యక్రమం వున్నప్పటికీ చంద్రబాబు పర్యటన కోసం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 29న తిరుపతిలో పర్యటించనున్నారు. ఆ రోజు మొత్తం ఆయన తిరుపతిలోనే గడుపుతారని సమాచారం. నగరంలోని ప్రధాన మార్గాల్లో రోడ్ షో వుంటుందని తెలిసింది. బహిరంగసభ నిర్వహిస్తారా లేక రోడ్షోలోనే ప్రధాన కూడళ్ళలో ప్రసంగిస్తారా అన్నది ఇంకా ఖరారు కాలేదు.