Share News

టీడీపీ బీసీ నేతలే టార్గెట్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:45 AM

మద్యం, నగదు ఉన్నాయంటూ తనిఖీలు

టీడీపీ బీసీ నేతలే టార్గెట్‌
ఈశ్వర్‌ ఇంట్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

చిత్తూరు సిటీ, ఏప్రిల్‌ 27: టీడీపీ బీసీ నేతలే టార్గెట్‌గా వారి ఇళ్లలో ఎన్నికల అధికారులు, పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. మద్యం, నగదు ఉందన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. సంతపేటలో చిత్తూరు కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నేత పి.షణ్ముగం, టీడీపీ చిత్తూరు నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు ఆర్‌.ఈశ్వర్‌ (ఆయన సతీమణి ఆర్‌.రతీదేవి టీడీపీ మాజీ కార్పొరేటర్‌), 47వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి ఉదయ్‌కుమార్‌ నివాసాల్లో తనిఖీలు చేసి, ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కావాలనే తమపై అసత్య ప్రచారం చేసి, పోలీసులతో సోదాలు నిర్వహించి అవమానపరచారని విమర్శించారు. ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:45 AM