Share News

సంస్కృత భాష పరిరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:26 AM

సంస్కృతం మన సాంస్కృతిక వారసత్వ సంపద అని, దాని పరిరక్షణ, ప్రచారం అందరూ బాధ్యతగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ పిలుపునిచ్చారు.

సంస్కృత భాష పరిరక్షణ అందరి బాధ్యత

సంస్కృతవర్సిటీ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి

తిరుపతి రూరల్‌, ఏప్రిల్‌ 26: సంస్కృతం మన సాంస్కృతిక వారసత్వ సంపద అని, దాని పరిరక్షణ, ప్రచారం అందరూ బాధ్యతగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ పిలుపునిచ్చారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం చాన్సలర్‌ ఎన్‌.గోపాలస్వామి అధ్యక్షతన శుక్రవారం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రా చీన రాతప్రతులను పరిరక్షించడంలో ఆధునిక సాం కేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. భారతీయ జ్ఞాన పరంపర పునరుద్ధరణ, ప్రచారంలో సంస్కృత వర్సిటీ వంటి సంస్థల పాత్ర ప్రముఖమైందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది విద్యార్థులకు ఉప రాష్ట్రపతి బంగా రు పతకాలు, నగదు బహుమతులు ప్రదా నం చేశారు. వీసీ ప్రొఫెసర్‌ జీఎ్‌సఆర్‌ కృష్ణమూర్తి, ఐసర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సంతను భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 09:09 AM