Share News

సైయెంట్‌ లాభం రూ.173 కోట్లు

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:16 AM

సైయెంట్‌ డీఈటీ (డిజిటల్‌, ఇంజనీరింగ్‌, టెక్నాలజీ).. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,489 కోట్ల ఆదాయంపై రూ.173 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

సైయెంట్‌ లాభం రూ.173 కోట్లు

సైయెంట్‌ డీఈటీ (డిజిటల్‌, ఇంజనీరింగ్‌, టెక్నాలజీ).. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,489 కోట్ల ఆదాయంపై రూ.173 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఆదాయం స్వల్పంగా 2.8 శాతం పెరగగా లాభం మాత్రం 9.1 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ నిలకడైన వృద్ధిని నమోదు చేసినట్లు సైయెంట్‌ పేర్కొంది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,911 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.689 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు తెలిపింది.

Updated Date - Apr 26 , 2024 | 04:16 AM