Share News

వాక్ స్వాతంత్ర్యంపై పెరుగుతున్న అసహనం

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:32 AM

ఇటీవలి కాలంలో పెరుగుతున్న మతపరమైన అసహన సంస్కృతికి అనుగుణంగా ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించబడిన కొన్ని మతోన్మాద శక్తులు సోషల్ మీడియానీ, ఇతర సాధనాలనూ దుర్వినియోగం చేస్తూ...

వాక్ స్వాతంత్ర్యంపై  పెరుగుతున్న అసహనం

ఇటీవలి కాలంలో పెరుగుతున్న మతపరమైన అసహన సంస్కృతికి అనుగుణంగా ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించబడిన కొన్ని మతోన్మాద శక్తులు సోషల్ మీడియానీ, ఇతర సాధనాలనూ దుర్వినియోగం చేస్తూ, స్త్రీల పట్ల అశ్లీలమైన, అసభ్యకరమైన భాషను వాడుతూ ప్రగతిశీల మహిళా మేధావులను, రచయిత్రులను, జర్నలిస్టులను, ఏక్టివిస్టులను, కళాకారులను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో నీచమైన దాడులు చేస్తున్నాయి. వీరు వినియోగించే పద్ధతులు, వాడే భాష వీరి నేపథ్యాన్నీ, మేధాస్థాయినీ, నేర ప్రవృత్తినీ వెల్లడిస్తున్నాయి. తమ ఆలోచనలతో ఏకీభవించకుండా, భిన్నమైన ఆలోచనలు కలిగినవారి నోళ్లు మూయించే అనాగరిక, అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. సహజంగానే ఈ రకమైన దాడి ప్రధానంగా స్త్రీల మీదనే ఎక్కువగా జరుగుతున్నది. స్త్రీలు దేశంలో ఏర్పడుతున్న మత, రాజకీయ పరిణామాల గురించి ఆలోచించడం, తమ భావాలను వ్యక్తపరచడం ఈ అప్రజాస్వామిక, సంప్రదాయ వాద సమర్థక ముఠాలకు నచ్చదు. స్త్రీలు తమ ఇష్టాలకు అనుగుణంగా కట్టు, బొట్టు, వేష, భాష ధారణలు చేసినప్పుడల్లా ఈ అరాచకులు రంగంలోకి దిగి వ్యక్తిగతంగా కాల్ చేసి, తలుచుకుంటే వారి ఇళ్లపై దాడులు చేయగలమని, ప్రాణ హాని తలపెట్టగలమని బెదిరింపులకు పూనుకుంటున్నారు. ఈ అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక ధోరణులను మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ఈ దేశ పౌరులందరికీ వాక్ స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఫలానా విధంగా అభిప్రాయాలు వ్యక్త పరచకూడదని, ఫలానా విధంగానే బతకాలని శాసించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ ప్రాథమిక హక్కుని ప్రభుత్వంతో బాటు ఎవరూ హరించ డానికి వీలులేదు. ఈ విధంగా బెదిరింపులకు, దాడులకు పాల్పడే శక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలను, పోలీసు వ్యవస్థను కోరుతున్నాం.

ప్రజాస్వామిక సంస్థలు, వేదికలు: ప్రొ.జి. లక్ష్మణ్ (పౌరహక్కుల సంఘం, తెలంగాణ); ఎస్. జీవన్ కుమార్ (మానవ హక్కుల వేదిక, తెలం గాణ, ఆంధ్ర రాష్ట్రాలు); అరసవిల్లి కృష్ణ, రివేరా (విరసం); శ్రీదేవి(చైతన్య మహిళా సంఘం); విజయ భండారు (హైదరాబాద్ విమెన్ రైటర్స్ ఫోరమ్); పసునూరి రవీందర్ (సముహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్); కె. శ్రీనివాసాచారి (హైదరాబాద్ హ్యుమనిస్ట్ మీట్); రేణుకా అయోల, తూముచర్ల రాజారాం (సంతకం సాహిత్య వేదిక); ఐకా బాలాజీ (మంచి సినిమా గ్రూపు); బి. గిరిజ (వాయిస్ ఫర్ జెండర్ జస్టిస్); కొండవీటి సత్యవతి (భూమిక); అమరేంద్ర దాసరి (సాహితీవేదిక, డిల్లీ); డా. బైరి నరేష్ (మూఢనమ్మకాల నిర్మూలన సంఘం); మహిళా మరియు ట్రాన్స్ జండర్ సంస్థల ఐక్య కార్యాచరణ వేదిక; ఖలీదా పర్వీన్, ఉష (సన్నిహిత); వి. సంధ్య (POW); సజయ, సుమిత్ర (అంకురం); వంగపల్లి పద్మ (వాయిస్ ఆఫ్ ద పీపుల్); కన్నెగంటి రవి (రైతు స్వరాజ్యవేదిక); గీతాంజలి (వెన్నెల సాహిత్య సామాజిక అధ్యయన వేదిక).

కవులు, రచయితలు, కార్యకర్తలు, విలేకరులు, న్యాయవాద నిపుణులు: అఫ్సర్, నారాయణ స్వామి, డా. సి. మృణాళిని, గోగు శ్యామల, విమల, ప్రసాదముర్తి, అరణ్యకృష్ణ, వెంకటకృష్ణ, దొంతం చరణ్, నరేష్ సూఫీ, అరుణాంక్ లత, ఓల్గా, అక్కినేని కుటుంబరావు, పి. సత్యవతి, కొండేపూడి నిర్మల, ప్రతిమ, ఉదయమిత్ర, ఎ.కె. ప్రభాకర్, నల్లూరి రుక్మిణి, తేళ్ళ అరుణ, అపర్ణ తోట, శివలక్ష్మి, లక్ష్మీ సుహాసిని, కత్తి పద్మ, సీతా కంభంపాటి, శాంతి ప్రబోధ, అమరవాది నీరజ, గుత్తా జ్యోత్స్న, చల్లా సరోజినీ దేవి, బెల్లపు అనురాధ, చలం జీ.ఎస్, దుర్గా డింగరి, ఘంటసాల నిర్మల, పైడిమర్రి గిరిజ, జయలక్ష్మి, సమ్మెట ఉమాదేవి, మంజుల, రోహిణి వంజారి, రాజ్యలక్ష్మి, శ్రీదేవి, నాంపల్లి సుజాత, మెర్సీ మార్గరెట్, కాత్యాయిని కె, సంధ్య కె, వివి జ్యోతి, గోపరాజు సుధ, రూపా రుక్మిణి, సురేఖ, శీలా సుభద్రా దేవి, శిలాలోలిత, ఆశాలత, అంబిక, రత్నా సుమతి, రుక్మిణీ రావు, మీరా సంఘమిత్ర, రచన, వైజయంతి, ఇందిర, జహాఆరా, కల్పనా కన్నాబిరన్, హేమలలిత, సావిత్రి కోల, కన్నెగంటి అనసూయ, కృష్ణ కుమారి, ఝాన్సీ, అనసూయ, సుజాత, సరోజినీదేవి, శాంతిశ్రీ బెనర్జీ, రోహిణి, డా. కె.బి సంధ్యా విప్లవ్, వాసరచెట్ల జయంతి, జ్వలిత, డా.నళిని, అరుణ, డి. భారతి, కె. ప్రవీణ్, వైష్ణవిశ్రీ, సుభాషిణి తోట, సి.హెచ్. ఉషారాణి, శోభాభట్, రోజారాణి దాసరి తదితరులు.

Updated Date - Mar 28 , 2024 | 01:32 AM