Share News

Loksabha Polls 2024: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన‌ బీజేపీ

ABN , Publish Date - May 04 , 2024 | 10:13 AM

ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. పోలింగ్‌కు మరో వారం మాత్రమే సమయం ఉండడంతో ప్రచారంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరో రౌండ్ ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు రానున్నారు.

Loksabha Polls 2024: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన‌ బీజేపీ

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. పోలింగ్‌కు మరో వారం మాత్రమే సమయం ఉండడంతో ప్రచారంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరో రౌండ్ ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు రానున్నారు. ఈ నెల 8, 10 తేదీల్లో తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. 8న కరీంనగర్, వరంగల్ పార్లమెంట్ పరిధిలో మోదీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

AP Election 2024: ఐదేళ్ల అవినాశనం.. 80వ దశకం చూపించారు


8న ఉదయం వేములవాడ రాజన్నను ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. ఎంపీ అభ్యర్థులు బండి‌ సంజయ్, ఆరూరీ రమేష్‌కు మద్దతుగా మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. 10న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ స్టేడియంలో మోదీ బహిరంగ సభలో పాల్గొని ప్రసగించనున్నారు. రేపు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. అదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. 6న తెలంగాణకు జేపీ నడ్డా రానున్నారు. పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండ ఎన్నికల సభలో నడ్డా ప్రసంగించనున్నారు.

Loksabha Polls: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నయా స్ట్రాటజీ.. ఎంటంటే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 10:13 AM