Share News

ఆరంభం అదిరె..

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:17 AM

థామస్‌, ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత జట్లు శుభారంభం చేశాయి. పురుషుల థామస్‌ కప్‌ గ్రూప్‌ ‘సి’లో..డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ 4-1తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది...

ఆరంభం అదిరె..

థామస్‌, ఉబెర్‌ కప్‌లో భారత జట్ల గెలుపు

చెంగ్డూ (చైనా): థామస్‌, ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత జట్లు శుభారంభం చేశాయి. పురుషుల థామస్‌ కప్‌ గ్రూప్‌ ‘సి’లో..డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ 4-1తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. ఉబెర్‌ కప్‌ గ్రూప్‌ ‘ఎ’లో భారత మహిళల జట్టు 4-1తో కెనడాను ఓడించిం ది. తొలుత అస్మిత 26-24, 24-22తో మిచెల్లీకి షాకివ్వగా, డబుల్స్‌లో ప్రియ/శ్రుతి 21-12, 21-10తో కాథరిన్‌/జెస్లిన్‌పై, ఇషారాణి 21-13, 21-12తో యు జాంగ్‌పై, అన్మోల్‌ 21-15, 21-11తో జాంగ్‌పై నెగ్గారు. రెండో డబుల్స్‌లో సిమ్రాన్‌/రితిక 19-21, 15-21తో జాకీ/క్రిస్టల్‌ చేతిలో ఓడారు. థాయ్‌లాండ్‌తో ఆరంభ మ్యాచ్‌లో ప్రణయ్‌ 20-22, 14-21తో వితిద్‌ చేతిలో ఓడాడు. కానీ డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ 21-19, 19-21, 21-12తో సుఖ్‌పన్‌/పక్కాపోన్‌పై, లక్ష్యసేన్‌ 21-12, 19-21, 21-16తో పనిచ్‌పోన్‌పై, అర్జున్‌/కపిల 21-19, 21-15తో పన్‌పనిచ్‌/సోథోన్‌పై, శ్రీకాంత్‌ 21-9, 21-5తో సరన్‌ జమ్‌శ్రీపై గెలిచారు.

Updated Date - Apr 28 , 2024 | 01:17 AM