Share News

ఆషి-స్వప్నిల్‌ జోడీకి స్వర్ణం

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:38 AM

బాకు (అజర్‌బైజాన్‌): షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో ఆషి చౌక్సే-స్వప్నిల్‌ కుశాలే జోడీ...

ఆషి-స్వప్నిల్‌ జోడీకి స్వర్ణం

బాకు (అజర్‌బైజాన్‌): షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో ఆషి చౌక్సే-స్వప్నిల్‌ కుశాలే జోడీ 16-12తో డారియా టైఖోవా-సెర్హి కులిష్‌ (ఉక్రెయిన్‌) ద్వయాన్ని ఓడించింది. స్వప్నిల్‌కు ఇది మూడో పతకం. స్వప్నిల్‌ వ్యక్తిగత, పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో రజత పతకాలు కొల్లగొట్టాడు. మొత్తంగా ఈ వరల్డ్‌కప్‌ను భారత్‌ రెండు పసిడి, మూడు రజతాలు సహా 5 పతకాలతో రెండో స్థానంలో ముగించిం ది. కొరియా మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Updated Date - Apr 24 , 2024 | 04:38 AM