Marathon: ఎన్ఎండీసీ మారథాన్ ప్రారంభం
ABN , Publish Date - Aug 25 , 2024 | 06:51 AM
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్ ఈరోజు (ఆదివారం) లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుంది.
హైదరాబాద్: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్ ఈరోజు (ఆదివారం) లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుంది. ఫుల్ మారథాన్ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
మారథాన్లో వివిధ దేశాల రన్నర్లు పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్నెస్ అవేర్నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్ ఇదని వెల్లడించారు. 60, 70 ఏళ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ మారథాన్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రన్నర్స్ పాల్గొన్నారు.
కాగా, ఈ మారథాన్ను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి సరికొత్తగా ఎన్ఎండీసీ మారథాన్ను ప్రారంభించింది. గత మంగళవారం ఈ మారథాన్కు సంబంధించిన ప్రణాళికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డెరెక్టర్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్లలన్, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మారథాన్కు సంబంధించిన టీషర్ట్, మెడల్స్ విడుదల చేశారు.